Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో రూ.4 లక్షల కోట్లు ఆదాయం పెరిగిన గౌతం ఆదానీ

ఠాగూర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (14:56 IST)
దేశంలోని పారిశ్రామిక దిగ్గజాల్లో గౌతం ఆదానీ ఒకరు. ప్రస్తుత యేడాదిలో ఆయన అత్యధికంగా ఆదాయాన్ని అర్జించారు. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో హయ్యెస్ట్ వెల్త్ గెయినర్స్ జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. 2024లో గౌతం ఆదానీ సంపద ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్లు) మేరకు పెరిగింది. 
 
గత యేడాది కంటే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఒక సంవత్సరంలో ఒక భారతీయుడు ఆర్జించిన అత్యధిక సంపద కూడా ఇదే కావడం గమనామర్హం. ఈ యేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓపీ జిందాల్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ సావిత్రి జిందాల్ల ఉమ్మడి సంపద పెరుగుదల కంటే ఎక్కువగా గౌతమ్ అదానీ ఆర్జించడం గమనార్హం. దీంతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ సంపద 116 బిలియన్ డాలర్లకు చేరింది.
 
ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో ఈ యేడాది అత్యధిక సంపద పొందిన వ్యక్తుల జాబితాలో అదానీ తర్వాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. 2024లో ఆయన సంపద 27.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో అతడి నికర ఆస్తి విలువ 119.5 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతం అదానీతో పోల్చితే 3.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువ సంపదను కలిగివున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments