Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ ధర తగ్గింపు .. ట్విస్ట్ పెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Webdunia
ఆదివారం, 22 మే 2022 (14:11 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పనిలోపనిగా వంట గ్యాస్ సిలిండరుపై రూ.200 మేరకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, ఇక్కడో మెలిక పెట్టారు. 
 
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ల పొందిన గృహ వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. అంటే ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఈ లబ్ధిదారులకు మాత్రమే వంట గ్యాస్ ధరలో రూ.200 తగ్గనుంది. 
 
ఈ తగ్గింపుతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.803కు దిగిరానుంది. ఈ 9 కోట్ల మంది లబ్ధితారుల గ్యాస్ సిలిండరుకు రూ.200 చొప్పున రాయితీని కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఈ సబ్సీబీ 12 ఎల్పీజీ సిలిండర్ల వరకు ఉంటుందని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ధర తగ్గింపుతో కేంద్ర ఖజానాపై రూ.6100 కోట్ల భారం పడుతుందని ఆమె గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments