Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1 నుంచి ఆధార్ కీలకం... పాస్‌పోర్ట్‌కు ఆధార్ నెంబర్ కంపల్సరీ

Webdunia
గురువారం, 2 జులై 2020 (13:07 IST)
2020 ఏడాదిలో జూలై 1 నుంచి కీలకంగా మారనుంది. జూలై నుంచి ఆధార్ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు కూడా తీసుకోకపోవడం కుదరకపోవచ్చు. ఆదాయపు పన్ను, ఆధార్‌కు సంబంధించిన రూల్స్‌లో కూడా మార్పు వచ్చింది. 
 
ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే. అంటే మీరు ఆధార్ నెంబర్ కలిగి లేకపోతే ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ వ్యవహారాల శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 
 
పాస్‌‌పోర్ట్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ కచ్చితంగా ఉండాలని తెలియజేసింది. అంటే జూలై 1 తర్వాత మీరు పాస్‌పోర్ట్ తీసుకోవాలని యోచిస్తే.. తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కూడా పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ కచ్చితంగా లింక్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. 
 
అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా ఆధార్ నెంబర్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ చేసుకోవడం వల్ల పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు సులభంగానే విత్‌డ్రా చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments