Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.17 ఖర్చుతో 116 కిలోమీటర్ల ప్రయాణం... ఎలా?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (08:39 IST)
పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగా, కర్బన ఉద్గర రహిత స్కూటర్లను తయారు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) స్టార్టప్‌ ప్యూర్‌ ఈవీ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ని విడుదల చేసింది. 
 
ఈ స్కూటర్‌ను ఒకసారి చార్జింగ్‌ చేస్తే నిరాటంకంగా 116 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. 2.5 కిలోవాట్‌ లిథియం బ్యాటరీని ఒకసారి చార్జింగ్‌ చేస్తే కేవలం రూ.15-17 మాత్రమే ఖర్చవుతుందని తెలిపింది. ఒకసారి చార్జి చేయడం వల్ల 110 నుంచి 116 కిలోమీటర్ల మేరకు ప్రయాణించవచ్చని పేర్కొంది. 
 
సాధారణ ఎలక్ట్రిక్‌ వాహనాలకు భిన్నంగా ఈ బ్యాటరీని ఇంట్లోని 10-15 యాంప్‌ ప్లగ్‌తో చార్జింగ్‌ చేసుకోవచ్చు. నాలుగు గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ అవుతుందని పేర్కొంది. పేటెంటెడ్‌ బ్యాటరీ సాంకేతికతో రూపొందించిన ఈప్లూటో 7జీని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐక్యాట్‌) ధృవీకరించిందని ప్యూర్‌ ఈవీ ఎండీ గార్గి పచాల్‌ అన్నారు. 
 
అంతేకాదు ఒక్కసారి చార్జ్‌ చేస్తే గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 116 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఐదు సెకన్ల లోపే అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కూడా ఒక్క రూపాయి తక్కువగా రూ.80 వేలుగా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments