Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఈపీఎఫ్ సొమ్ము విత్‌డ్రా మరింత సులభతరం...

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (19:21 IST)
ఉద్యోగ భవిష్యత్ నిధి (ఈపీఎఫ్ఓ) సంస్థ నుంచి ఆన్‌లైన్‌లో నగదు ఉపసంహరణ మరింత సులభతరం చేసింది. ఇకపై ఆన్‌లైన్‌లో డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే క్యాన్సిల్ చెక్కును అప్‌లోడ్ చేసే అవసరాన్ని తప్పించింది. దీంతోపాటు బ్యాంకు ఖాతాను యజమానులు ధృవీకరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియతో దాదాపు ఎనిమిది కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. 
 
ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నిధులు ఉపసంహరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే యూఏఎన్ లేదా పీఎఫ్ నంబరుతో లింక్ చేసిన బ్యాంక్ పాస్‌బుక్‌కు సంబంధించిన చెక్కు ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 
 
ఆ తర్వాత దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా వివరాలు కూడా యజమానులు ఆమోదించాల్సి ఉంటుంది. అంటే ఈ రెండంచెల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే నగదు చేతికందేది. ఈ అవసరాన్ని ఈపీఎఫ్‌లో పూర్తిగా తొలగించినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తిరస్కరణల్ని తగ్గించేందుకు ఈ చర్యలు సాయపడుతాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments