Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌కి కరోనాపాజిటివ్ వ్యక్తులు, ఎయిర్ ఇండియా విమానాలపై దుబాయ్ ప్రభుత్వం నిషేధం

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:20 IST)
భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలపై దుబాయ్ ప్రభుత్వం 15 రోజులపాటు నిషేధం విధించింది. గత రెండు వారాల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ ఉన్న ప్రయాణికులను రెండుసార్లు తీసుకువచ్చినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటి అధికారులు ఎయిర్ ఇండియా సర్వీసులను అక్టోబరు 2 వరకు నిలిపివేసినట్లు శుక్రవారం వెల్లడించారు.
 
యుఏఈ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులందరూ 96 గంటలు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో నెగటివ్‌గా నిర్థారణ అయినట్లు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటేనే దుబాయ్ రావడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈ నెల 4న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జైపూర్ దుబాయ్ విమానంలో ప్రయాణించిన వ్యక్తి వద్ద సెప్టెంబరు 2వ తేదీతో కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్ ఉందని అధికారులు తెలిపారు.
 
ఇంతకుముందు వారం కూడా ఇలాంటి సంఘటన జరిగిందని ఈ మేరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 2 వరకు నిలిపివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments