Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌కి కరోనాపాజిటివ్ వ్యక్తులు, ఎయిర్ ఇండియా విమానాలపై దుబాయ్ ప్రభుత్వం నిషేధం

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:20 IST)
భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలపై దుబాయ్ ప్రభుత్వం 15 రోజులపాటు నిషేధం విధించింది. గత రెండు వారాల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ ఉన్న ప్రయాణికులను రెండుసార్లు తీసుకువచ్చినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటి అధికారులు ఎయిర్ ఇండియా సర్వీసులను అక్టోబరు 2 వరకు నిలిపివేసినట్లు శుక్రవారం వెల్లడించారు.
 
యుఏఈ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులందరూ 96 గంటలు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో నెగటివ్‌గా నిర్థారణ అయినట్లు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటేనే దుబాయ్ రావడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈ నెల 4న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జైపూర్ దుబాయ్ విమానంలో ప్రయాణించిన వ్యక్తి వద్ద సెప్టెంబరు 2వ తేదీతో కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్ ఉందని అధికారులు తెలిపారు.
 
ఇంతకుముందు వారం కూడా ఇలాంటి సంఘటన జరిగిందని ఈ మేరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 2 వరకు నిలిపివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments