Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దును సీక్రెట్‌గా ఉంచడానికి కారణమిదే.... అరుణ్ జైట్లీ

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును అత్యంత రహస్యంగా ఉంచడానికి గల కారణాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనే

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (06:51 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును అత్యంత రహస్యంగా ఉంచడానికి గల కారణాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సదస్సులో ప్రసంగించారు.
 
నోట్లు రద్దుచేస్తామని ముందుగానే ప్రకటిస్తే.. నల్లధనం దాచుకున్న వాళ్లు తమ వద్ద ఉన్న డబ్బును బంగారం, వజ్రాలు, భూముల కొనుగోళ్లు తదితర వాటికి మళ్లించే అవకాశం ఉండేదన్నారు. ఈ విషయంలో పారదర్శకత పాటిస్తే.. భారీ మోసానికి అదో సాధనంగా మారిపోయేదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్లరద్దు నిర్ణయం, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. 
 
పారదర్శకత అనేది ఎంతో గొప్ప పదం. కానీ నోట్లరద్దు లాంటి విషయాల్లో దాన్ని పాటిస్తే పెద్ద మోసానికి అవకాశమిచ్చేదిగా ఉండేదని అభిప్రాయపడ్డారు. 'తీసుకున్న నిర్ణయాలపై గోప్యత పాటించడం అవసరం. నోట్లరద్దు నిర్ణయం గొప్ప విజయం సాధించింది. దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన జట్టు, ఆర్‌బీఐ అన్నీ కలిసి పనిచేశాయి. అంతేకాకుండా నిర్ణయం తీసుకొనేటప్పుడే ప్రత్యామ్నాయ నోట్లను ముద్రించాం. ఈ ముద్రణలో వేలాదిమంది భాగస్వాములయ్యారు. కానీ ఎందుకు చేస్తున్నారో మాత్రం వాళ్లకు తెలియలేదు' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments