Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 102కి పెరిగిన కందిపప్పు ధర: గణనీయంగా పెరిగిన పప్పు ధరలు!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (10:53 IST)
పప్పు ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.  బియ్యం, పప్పు, నూనె తదితరాల ధరలు, ముఖ్యంగా, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరిలో రూ. 72 ఉన్న కిలో కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 102లకు చేరుకుంది. దీంతో పేదలు, చిరుద్యోగుల బతుకులు భారంగా మారుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
 
రెండు నెలల క్రితం సోనా మసూరి (కొత్త) బియ్యం ధర క్వింటాల్ రూ. 3 వేల వరకూ ఉండగా ప్రస్తుతం రూ. 3400లకు చేరింది. ఇక పాత బీయం ధర క్వింటాల్‌‌కు రూ. 4800 నుంచి రూ. 5000లు వరకూ ధర పలుకుతోంది. వీటికి తోడు కారం, చింతపండు, ధనియాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, పంచదార తదితర నిత్యావసరాల ధరలు కిలోకు రూ.6 నుంచి రూ. 10 వరకూ పెరిగాయి. నెల బడ్జెట్‌‌లో అధికభాగం ఆహార, నిత్యావసరాలకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు వాపోతున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు సైతం ధరల పెరుగుదలతో భారంగా మారాయి.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments