Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కత్తెర : అమెరికాలో 4.7 కోట్ల ఉద్యోగాలు ఉఫ్!! మరి భారత్‌లో...?

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (16:42 IST)
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు అనేక ప్రపంచ దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులు మూతపడ్డాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ క్రమంలో ఇపుడు కరోనా వైరస్ దెబ్బకు అమెరికా కుదేలుకానుందట. దాదాపు అన్ని అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ వెల్లడించిన అంచనాలు భయాందోళనలను కలిగించేలా ఉన్నాయి. 
 
కరోనా నేపథ్యంలో రెండో త్రైమాసికంలో నిరుద్యోగం 32.1 శాతానికి పెరుగుతుందని తెలిపింది. మొత్తం 4.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పింది. 1948 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగ స్థాయి ఉండబోతుండటం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
 
పలు రాష్ట్రాల్లో షట్ డౌన్ల కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. 33 లక్షల మంది ప్రజలు నిరుద్యోగ లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజా అంచనాల ప్రకారం సేల్స్, ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తులు, సేవల విభాగాలలో ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. క్షురకులు, రెస్టారెంట్ సర్వర్లు, ఫ్లైట్ అటెండెంట్లు కూడా భారీగా నిరుద్యోగులుగా మారనున్నారని ఆ సంస్థ నివేదిక పేర్కొంది. 
 
మరి భారత్ మాత్రం ఇతర దేశాలతో పోల్చితే సురక్షితంగా ఉంది. ముఖ్యంగా, కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలోనూ ఇతర దేశాలతో పోల్చితే ఒక అడుగు ముందుగానే ఉంది. అలాగే, ఆర్థిక వ్యవస్థ కూడా బాగా పటిష్టంగానే ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక కూడా తేల్చింది. దీంతో అయితే, లాక్‌డౌన్ తర్వాత చాలా మంది నిరుద్యోగులు అయ్యే అవకాశాలు ఉన్నాయనీ, ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువగా ఉంటుందని పలువురు అభిప్రాయడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments