Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత బ్యాంకులపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ : హెచ్‌డీఎఫ్‌సీలో వాటా

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:35 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నేలచూపుచూస్తున్నాయి. దీంతో అనేక కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి. దీన్ని తనకు అవకాశంగా మలచుకునేందుకు డ్రాగన్ కంట్రీగా పేరొందిన చైనా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, భారత్‌లోని ప్రముఖ మార్ట్‌గేజ్ బ్యాంకు అయిన హెచ్‌.డి.ఎఫ్.సి లో ఒక శాతం వాటాను గుట్టుచప్పుడుకాకుండా కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కొనుగోలు జరిగింది. 
 
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిన సమయంలో 25 శాతం ధర తగ్గిన దశలో 1.75 కోట్ల షేర్లను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా చడీచప్పుడు లేకుండా కొనుగోలు చేసింది. 
 
కాగా, ఈ బ్యాంకులో ఆ బ్యాంకు అప్పటికే 0.8 శాతం వాటాలు కలిగి ఉంది. తాజా కొనుగోలుతో ఈ వాటా ఒక శాతాన్ని మించిపోయింది. దీంతో ఈ విషయం బహిర్గతం చేయాల్సి వచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్-చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments