Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్‌పై కన్నేసిన చైనా ఈ-కామెర్స్ అలీబాబా!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (10:42 IST)
భారత మార్కెట్‌పై చైనా ఈ-కామెర్స్ దిగ్గజం కన్నేసింది. భారత్‌లోని అపార అవకాశాలను కొల్లగొట్టేందుకు అలీబాబా వ్యవస్థాపకుడు 'జాక్ మా' ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సొంతంగా కార్యకలాపాలు సాగించడంతో పాటు భారత్‌లో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలు, వ్యక్తులతో కలసి పనిచేసే విషయాలను కూడా జాక్ మా పరిశీలిస్తున్నారు. 
 
భారత్‌లో తొలి పర్యటనకు వచ్చిన జాక్ మా బుధవారం ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొని కీలకోపన్యాసం చేశారు. భారత్ లోని అపార అవకాశాలను ప్రస్తుతిస్తూనే, వాటిని చేజిక్కించుకునేందుకు తాను కూడా ఉవ్విళ్లూరుతున్నానని చెప్పారు. తన పర్యటనలో భాగంగా నేడు ఆయన పలు కంపెనీలతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా దేశీయ ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్‌తో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. స్నాప్ డీల్ లో జాక్ మా వాటా తీసుకుంటారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఇదిలా ఉంటే చైనా అపర కుబేరుడైన జాక్ మా భారత ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. తాను మోడీ ప్రసంగాన్ని విన్నానని, ఆ ప్రసంగం ఉత్తేజపూరితంగా ఉందని చెప్పారు. అంతేగాకుండా.. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడితే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments