Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారానికి భలే డిమాండ్..భారీగా పెరిగిన చికెన్ ధర

Webdunia
సోమవారం, 12 జులై 2021 (11:06 IST)
మాంసాహారానికి భలే డిమాండ్. ఆషాఢం, బోనాల పండుగ కావడంతో చికెన్‌కు గిరాకీ మరీ పెరిగింది. మటన్‌ ధర భారీగా ఉండటంతో చాలా మంది కోడి మాంసాన్ని తెచ్చుకొని తింటుంటారు. ఇక కిలో నాటు కోడి ధర రూ.700-750 వరకు పలుకుతోంది. బోనాల సమయంలో నాటుకోళ్లకు డిమాండ్‌ ఎక్కువ ఉంది. కరోనా కారణంగా అందరూ రోజు గుడ్లను తింటుండటంతో డిమాండ్‌ బాగా పెరిగింది. 
 
హోల్‌సేల్‌ దుకాణాల్లో డజన్‌ గుడ్లు రూ.65 నుంచి రూ.68 పలుకుతున్నాయి. కిరాణ దుకాణాల్లో రూ.72కు విక్రయిస్తున్నారు. అలాగే చికెన్‌ ధర కూడా కుతకుతలాడుతోంది. వారం.. వారం ధర పైపైకి ఎగబాకుతోంది. ఈ ఆదివారం కిలో చికెన్‌ ధర ఒక్కసారిగా రూ.240 నుంచి రూ.260కి చేరింది. 
 
హోల్‌సేల్‌లో రూ.240 ఉండగా, రిటైల్‌లో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. గత ఆదివారం కిలో చికెన్‌ రూ.180 నుంచి 200 లోపు మాత్రమే ఉంది. వారంలోనే కిలోకు ఒక్కసారిగా రూ.60 పెరిగింది. ఆదివారం నుంచి బోనాల పండుగ మొదలు కావడంతో హైదరాబాద్‌లో కోళ్లు, మేకలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరంభంలోనే చికెన్‌ ధర భారీగా ఉండటంతో జనం బెంబేలెత్తున్నారు. 
 
కరోనా మొదటి వేవ్‌ ఆరంభంలో చికెన్‌ ధరలు అమాం తం పడిపోయాయి. అయితే చికెన్‌ వల్ల కరోనా రాదని, ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చికెన్‌, గుడ్లు తప్పనిసరిగా తినాలని చెప్పడంతో మళ్లీ చికెన్‌ దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments