Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాలో డబ్బులు లేకున్నా ఏటీఎం కార్డు వినియోగిస్తున్నారా...?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (17:39 IST)
చాలా మంది బ్యాంకు ఖాతాలో సరైన మోతాదులో నగదు నిల్వ లేకపోయినప్పటికీ ఏటీఎం కార్డును స్వైప్ చేస్తుంటారు. ఇలాంటి వారి నుంచి బ్యాంకులు అపరాధం రుసుంను వసూలు చేస్తున్నాయి. ఈ విధానం ఎన్నో నెలల నుంచి అమల్లోవుంది. కానీ, చాలా మందికి తెలియదు. దీనికి కారణం సరైన అవగాహన లేకపోవడమే. 
 
అందుకే బ్యాంకింగ్ రంగ నిపుణులు ఓ హెచ్చరిక చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలో సరిపడనంత డబ్బులు లేనిపక్షంలో ఏటీఎం కార్డును స్వైప్ చేయొద్దని హితవు పలుకుతున్నారు. ఎందుకంటే ఖాతాలో డబ్బులు లేకున్నా ఏటీఎం కార్డులను వినియోగిస్తే.. బ్యాంకులు ఛార్జీల మోత మోగిస్తాయని హెచ్చరిస్తున్నారు.
 
బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైన సందర్భాల్లో దేశంలోని వివిధ బ్యాంకులు పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా వినియోగిస్తే ఎస్బీఐ రూ.20లతోపాటు జీఎస్టీ వసూలు చేస్తోంది. అలాగే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్, యాక్సిస్, మహేంద్ర బ్యాంకులు రూ.25లతోపాటు జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. 
 
ఇలాంటి ఛార్జీలపై వినియోగదారులు పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సలహా ఇస్తున్నారు. ఏటీఎం సెంటర్ కనబడగానే ట్రాన్సాక్షన్ చేయకుండా ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉన్నదో గుర్తుంచుకోని లావాదేవీలు చేయాలని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments