Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ - 78 రోజుల బోనస్

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (22:17 IST)
దేశ రైల్వే శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి బోనస్‌గా 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్‌ను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఖజానా మీద రూ.1,984.73 కోట్ల ఆర్థిక భారంపడనుంది. 
 
ఈ నిర్ణయంతో మొత్తం 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మేలు జరుగనుంది. అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ ఈ ఆర్థిక సంవత్సరానికి 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. 
 
ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు ఈ బోనస్‌ను చెల్లిస్తారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇస్తారు. కానీ ఈసారి 78 రోజుల బోనస్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించింది. 
 
నిజానికి కరోనా వైరస్ దేశంలో వెలుగు చూసిన తర్వాత దేశ వ్యాప్తంగా రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో రైల్వే సేవలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. అదేసమయంలో రైల్వే ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments