Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ఆర్ఐల కోసం 64 స్పెషల్ ఫ్లైట్స్... వసూలు చేసే చార్జీలు ఇవే...

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:26 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ బారినుంచి తమతమ దేశాల ప్రజలను కాపాడుకునేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలను సడలించాయి. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో దేశ పౌరులతో పాటు.. ప్రవాస భారతీయులు చిక్కుకుని పోయారు. ఇలాంటి వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేకంగా 64 విమానాలను నడుపనుంది. వీరందరనీ దశల వారీగా స్వదేశానికి తీసుకొస్తారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందులోభాగంగా, విదేశాల్లో చిక్కుకున్న, ఉంటున్న దేశ పౌరుల కోసం ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 64 ప్రత్యేక విమానాలు నడపనుంది. 
 
అదేసమయంలో స్వదేశానికి రావాలనుకుంటున్న పౌరులు నుంచి రుసుం వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. లండన్ నుంచి ఢిల్లీ వచ్చే విమానంలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు, ఢాకా నుంచి ఢిల్లీ వచ్చేందుకు రూ.12 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. 
 
తొలి విడతలో భాగంగా అమెరికా, గల్ఫ్ దేశాలు, మలేసియా, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలకు విమానాలు నడపనున్నారు. మొత్తం 14,800 మందిని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments