Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు శుభవార్త... పీఎఫ్ కొత్త స్కీమ్.. రూ.22,810 కోట్ల కేటాయింపు

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (14:51 IST)
ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్‌కు ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులకు బెనిఫిట్ కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,584 కోట్లు కేటాయించింది. 
 
2020-2023 కాలానికి గానూ రూ.22,810 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సబ్సిడీ బెనిఫిట్ అందిస్తుంది. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారికి మోదీ సర్కార్ రెండేళ్ల పాటు పీఎఫ్ సబ్సిడీ అందిస్తుంది. 1,000 వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటే.. అప్పుడు కేంద్ర ప్రభుత్వమే 24 శాతం పీఎఫ్ కంట్రిబ్యూషన్ చెల్లిస్తుంది. 
 
ఇందులో ఉద్యోగి వాటా 12 శాతం, కంపెనీ వాటా 12 శాతం. అయితే ఇక్కడ ఉద్యోగి వేతనం రూ.15,000లోపు ఉండాలి. అదే 1,000కి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే.. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి పీఎఫ్ కంట్రిబ్యూషన్ 12 శాతాన్ని చెల్లిస్తుంది. 
 
అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఉద్యోగాల్లోకి తీసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. వీరందరికీ రెండేళ్లపాటు పీఎఫ్ డబ్బులను కేంద్రమే చెల్లిస్తుంది. దీంతో ఉద్యోగుల చేతికి ఎక్కువ వేతనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments