Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా చీఫ్‌కే ఆ గతి.. పురుగులు, దుర్వాసనతో కూడిన ఆహారం..

రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ఆహారంపై ఇప్పటికే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ ముంబై సో

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (17:02 IST)
రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ఆహారంపై ఇప్పటికే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ ముంబై సోషల్ మీడియా చీఫ్ కరణ్ రాజ్ సింగ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా కరణ్ తన అనుచరునితో కలిసి గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్‌లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 
 
రైల్వే కేటరింగ్ సరఫరా వ్యవహారాన్ని స్వయంగా తెలుసుకోవడం కోసం రాజ్ సింగ్ ఆహారం ఆర్డర్ చేశారు. అయితే రైలు క్యాటరింగ్ సిబ్బంది పురుగులతో దుర్వాసన వస్తున్న ఆహారాన్ని అందించడంపై కరణ్ తీవ్రంగా మండిపడ్డారు. 
 
అంతటితో ఆగకుండా.. ఈ వ్యవహారంపై మరో 30 మంది ప్రయాణికులతో కలసి కరణ్ రైల్వే మంత్రి గోయల్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన గోయల్.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారుల్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments