Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ బ్రాండ్ పేరుతో రూ.25లకే కిలో బియ్యం

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (20:45 IST)
బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని రూ.25కి విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఇప్పటికే భారత్ అటా, భారత్ దాల్ పేరుతో గోధుమ పిండి, పప్పులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. 
 
భారత్ ఇప్పుడు రూ.25కే బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని జాతీయ మీడియా వర్గాల సమాచారం. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సిసిఎఫ్), కేంద్రీయ భాండార్ అవుట్‌లెట్లు, మొబైల్ వ్యాన్‌ల ద్వారా బియ్యాన్ని సబ్సిడీ ధరకు విక్రయించనున్నట్లు తెలిసింది.
 
ప్రస్తుతం బియ్యం ధరలు కిలో సగటున రూ.44కు చేరాయి.పెరుగుతున్న ధరలను నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలనే ఆలోచనతో కేంద్రం భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకు బియ్యాన్ని సరఫరా చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం కేంద్రం భారత్ బ్రాండ్ కింద గోధుమ పిండిని కిలో రూ.27.50, వేరుశనగ కిలో రూ.60 సబ్సిడీ ధరలకు విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా అవుట్‌లెట్లలో వీటిని విక్రయిస్తున్నారు.
 
నిత్యావసర ఆహార ధాన్యాల ధరలను నియంత్రించేందుకు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించారు.
 
దేశీయ విపణిలో బియ్యం లభ్యతను పెంచేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ (OMSS) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) 4,00,000 టన్నుల బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయిస్తోంది. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా కిలోకు రూ.25 చొప్పున సబ్సిడీతో కూడిన రిటైల్ అమ్మకాలను కూడా ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం