Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు తాళం.. ఐదు రోజులు సేవలు బంద్

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (08:29 IST)
దేశంలోని బ్యాంకులకు తాళం పడనుంది. ఫలితంగా ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈనెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగనున్నారు. ఈరోజుల్లోనే ప్రభుత్వ సెలవుదినాలు కలిసి రావడంతో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీ అంటే శుక్రవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఆతర్వాత 22వ తేదీ నాలుగో శనివారం, 23వ తేదీన ఆదివారం, 25వ తేదీన క్రిస్మస్, 26వ తేదీన బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునివ్వడం వంటి కారణాల రీత్యా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనుండటంతో ఏటీఎం కేంద్రాల్లో కూడా నగదు నిండుకునే అవకాశం ఉంది. దీనికితోడు క్రిస్మిస్, కొత్త సంవత్సర వేడుకలు రావడంతో కస్టమర్లంతా తమ అవసరాల కోసం భారీ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా నగదు కష్టాలు ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదు. సో.. ముందే త్వరపడి నగదును విత్ డ్రా చేసుకుని నిల్వ ఉంచుకోవాలని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments