దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (20:36 IST)
భారతదేశంలో మరో అతిపెద్ద బ్యాంకు విలీనం జరిగింది. సోమవారం రోజున బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో దేనా, విజయా బ్యాంకులు విలీనమయ్యాయి. ఈ విలీనంతో దేశంలోనే రెండో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకుగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) అవతరించింది. అయితే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకు.
 
ఈ మూడు బ్యాంకుల వ్యాపారం దాదాపు రూ. 15లక్షల కోట్లు, ఇందులో రూ. 8.75 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో ఉంది, అలాగే అడ్వాన్సుల రూపంలో 6.25లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ విలీనంతో బ్యాంక్ ఆఫ్‌ బరోడా పరిధిలోకి 9500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల మంది వినియోగదారులు వచ్చి చేరారు. 
 
ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఈ బ్యాంకుల విలీనం అంశాన్ని వెల్లడించింది. ఈ బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ప్రతి 1000 విజయాబ్యాంక్‌ షేర్లకు 402 బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు లభిస్తాయి. అదే సమయంలో ప్రతి 1000 దేనా బ్యాంక్‌ షేర్లకు 110 బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments