Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటకప్రదేశ్‌ : ఏపీలో 8 ప్రాజెక్టుల ఒప్పందాల ఖరారు

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (19:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక ప్రదేశ్‌గా మార్చుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీన్ని నిజం చేసేలా శనివారం ఒక్కరోజే ఏడు పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మరో ముందడుగు వంటివి. 
 
విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.1240 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టులపై ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడ, తిరుపతి, విశాఖల్లో ఎమ్యూజెమెంట్‌, వాటర్‌ వరల్డ్‌ పార్కులు నిర్మించనున్నారు. 
 
డెస్టినేషన్‌ అండ్‌ ప్యాకేజ్‌ టూర్లు, హోటల్స్‌, రిసార్టులు, బీచ్‌ రిసార్టులు , ఫైవ్‌స్టార్‌, తీస్టార్‌ హోటళ్లు, కడపలో వే సైడ్‌ అమెనిటీస్‌ ఏర్పాటు తదితర ఒప్పందాలు ఖరారయ్యాయి. తిరుచానూరులో గేట్‌వే హోటల్‌ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. రెండకెరాల విస్తీర్ణంతో రూ.85 కోట్ల పెట్టుబడితో గేట్‌వే హోటల్‌ను నిర్మించనున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments