Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్లా వచ్చినా పోటీని తట్టుకుని ఇలాగే ముందుకు వెళతాం : ఆనంద్ మహీంద్రా

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (19:51 IST)
టెస్లా వంటి దిగ్గజ సంస్థలు భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటికీ తద్వారా ఎదురయ్యే పోటీని తట్టుకుని ముందుకు పోతామని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్, దేశ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లోకి టెస్లా కంపెనీ అడుగుపెడితే తద్వారా ఎదురయ్యే పోటీని ఎలా తట్టుకుంటారంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా తనదైనశైలిలో స్పందించారు. 
 
1991లో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత ఇలాంటి ఎన్నోప్రశ్నలు ఉత్పన్నమయ్యాయన్నారు. అపుడు మార్కెట్‌లోకి వచ్చిన టాటా, సుజుకీ వంటి పలు కంపెనీల పోటీని తట్టుకుని నిలబడ్డామని గుర్తుచేశారు. మహీంద్రా ఉత్పత్తులపై ప్రజలకు ఉన్న నమ్మకమే దీనికి కారణమన్నారు. 
 
టెస్లా మార్కెట్‌లోకి వచ్చినా తమ సంస్థ ఇలాగే ముందుకు వెళుతుందని ఆయన వివరించారు. భారత ప్రజలు, వినియోగదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పోటీని తట్టుకుని ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, 2018లో ఎలాన్ మస్క్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నపుడు ఆయనకు మద్దతు ఇస్తూ పోస్టును ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అపుడు ఆయనకు ఎలాగైతే మద్దతిచ్చామో, ఇపుడు కూడా అలాగే ఉంటామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments