సామాన్యులపై బాదుడే బాదుడు... పాల ధర పెంపు

Webdunia
గురువారం, 1 జులై 2021 (13:12 IST)
సామాన్యులపై బాదుడే బాదుడు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అలాగే వంట నూనెల ధరలు కూడా పెరిగిపోయాయి. గ్యాస్ సిలిండర్ ధర కూడా  నుంచే పెరిగింది. ఇప్పుడు వీటి సరసన పాలు కూడా వచ్చి చేరాయి. పాల ధర జూలై-1 నుంచి పెరిగింది. 
 
అమూల్ మిల్క్ పాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. జూలై 1 నుంచి రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సీనియర అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
 
అమూల్ మిల్క్ బ్రాండ్స్ అన్నింటికీ రేట్ల పెంపు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. దీంతో పాలు కొనుగోలు చేసే వారు లీటరుకు ఇప్పుడు రూ.2 అదనంగా చెల్లించుకోవాలి. అమూల్‌కు చెందిన గోల్డ్, టాజా, శక్తి, టీ స్పెషల్ వంటి పలు బ్రాండ్ల ధరలు పెరిగాయి. 
 
ఇప్పుడు లీటరు పాలు కొనాలంటే రూ.48 నుంచి రూ.58 వరకు చెల్లించుకోవాలి. పాల క్యాకేజింగ్ వ్యయాలు 30 నుంచి 40 శాతం పెరిగాయని, అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ 30 శాతం పెరిగిందని ఆయన వివరించారు. అలాగే ఎనర్జీ కాస్ట్ 30 శాతం పెరిగిందని తెలిపారు. దీంతో పాల ధర పెంచాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments