Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యులకు ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.. కనీస చార్జీ లేకుండానే ఫ్లైట్ జర్నీ!!

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (21:59 IST)
కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడంలోనూ, ఈ వైరస్ సోకిన వారికి తమ ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్యులకు ప్రైవేట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కనీస చార్జీ చెల్లించకుండానే దేశంలో ఎక్కడైనా విమానంలో ప్రయాణించవచ్చని పేర్కొంది. 
 
ఈ విమానయాన సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల మేరకు... ఈ ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌పై పోరాడుతున్న వైద్యుల కోసం 50 వేల సీట్లు కేటాయిస్తున్నట్టు ఎయిర్ ఏషియా ఇండియా విభాగం వెల్లడించింది. 
 
ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని ప్రయాణించే వైద్యులు విమాన కనీస చార్జీ చెల్లించకుండానే ప్రయాణం చేయొచ్చు. అంటే, కనీస చార్జీ లేకుండా, కేవలం ఎయిర్‌పోర్టు ఫీజు, ఇతర పన్నులు చెల్లిస్తే చాలు. సదరు ప్రయాణికుడు దేశంలో ఎక్కడికైనా నామమాత్రపు చార్జీతో ప్రయాణించవచ్చు. 
 
జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 మధ్య ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వైద్యులు తమ వివరాలను జూన్ 12 లోపు నమోదు చేసుకోవాలి. సంప్రదింపుల వివరాలు, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, ఐడీ వంటి వివరాలు అందిస్తే ఎయిర్ ఏషియా వర్గాలు వాటిని పరిశీలించి టికెట్ మంజూరు చేస్తామని ఎయిర్ ఏషియా వాణిజ్య విభాగం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments