Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. ఏంటది?

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:37 IST)
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందులో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పింఛనుదారులు కూడా ఉన్నారు. 
 
ఏడో వేతన సంఘం సిఫార్సులతో పాటు.. ప్రస్తుతం ఉన్న 28 శాతం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కరవు భత్యం (డీఏ), డియర్‌నెస్ రిలీప్ (డీఆర్‌)లను పెంచేందుకు నిర్ణయించినట్టు సమాచారం. 
 
కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు... డీఏను 17 నుంచి 21 శాతానికి అంటే 4 శాతం పెంచేందుకు నిర్ణయించింది. జనవరి నుంచి ఇది వర్తించే అవకాశం ఉంది. అయితే, దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితిని వివరించి, ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఇవ్వాలని కోరారు. 
 
కోవిడ్ సంక్షోభం కారణంగా 2021 జూలై వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏలో ఇంక్రిమెంట్ నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 2020న నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments