Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI ఖాతా దారులకి శుభవార్త : నెలాఖరులోగా సమర్పించేందుకు అవకాశం

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (15:22 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీని ఈనెలాఖరు వరకు పొడగించింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్‌, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేన‌ని, లేదంటే సేవ‌ల‌ను నిలిపేస్తామ‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. 
 
అదేసమయంలో శుక్ర‌వారం చాలా మంది క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంక్ నుంచి సందేశాలు అందాయి. కొంద‌రు త‌మ ఖాతాల్లో భారీగా ఉన్న డ‌బ్బును హోల్ట్‌లో పెట్టిన‌ట్లు బ్యాంక్ నుంచి వ‌చ్చిన మెసేజ్ చూసి ఆందోళ‌న చెందారు. 
 
అయితే బ్యాంక్‌లో పాన్‌, ఆధార్ కార్డ్‌తో స‌హా కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తే తిరిగి హోల్డ్‌లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్‌, ఆధార్‌ను ఎందుకు లింక్ చేయాలో కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది.
 
ఇక పాన్ కార్డుతో ఆధార్‌ను ఆన్‌లైన్‌లో లింకు చేసేందుకు www.incometaxindiaefilling.gov.in లింకును కూడా ఎస్‌బీఐ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌తో షేర్ చేసింది. పాన్‌, ఆధార్ అనుసంధానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments