SBI ఖాతా దారులకి శుభవార్త : నెలాఖరులోగా సమర్పించేందుకు అవకాశం

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (15:22 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీని ఈనెలాఖరు వరకు పొడగించింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్‌, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేన‌ని, లేదంటే సేవ‌ల‌ను నిలిపేస్తామ‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. 
 
అదేసమయంలో శుక్ర‌వారం చాలా మంది క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంక్ నుంచి సందేశాలు అందాయి. కొంద‌రు త‌మ ఖాతాల్లో భారీగా ఉన్న డ‌బ్బును హోల్ట్‌లో పెట్టిన‌ట్లు బ్యాంక్ నుంచి వ‌చ్చిన మెసేజ్ చూసి ఆందోళ‌న చెందారు. 
 
అయితే బ్యాంక్‌లో పాన్‌, ఆధార్ కార్డ్‌తో స‌హా కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తే తిరిగి హోల్డ్‌లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్‌, ఆధార్‌ను ఎందుకు లింక్ చేయాలో కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది.
 
ఇక పాన్ కార్డుతో ఆధార్‌ను ఆన్‌లైన్‌లో లింకు చేసేందుకు www.incometaxindiaefilling.gov.in లింకును కూడా ఎస్‌బీఐ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌తో షేర్ చేసింది. పాన్‌, ఆధార్ అనుసంధానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments