Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI ఖాతా దారులకి శుభవార్త : నెలాఖరులోగా సమర్పించేందుకు అవకాశం

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (15:22 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీని ఈనెలాఖరు వరకు పొడగించింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్‌, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేన‌ని, లేదంటే సేవ‌ల‌ను నిలిపేస్తామ‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. 
 
అదేసమయంలో శుక్ర‌వారం చాలా మంది క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంక్ నుంచి సందేశాలు అందాయి. కొంద‌రు త‌మ ఖాతాల్లో భారీగా ఉన్న డ‌బ్బును హోల్ట్‌లో పెట్టిన‌ట్లు బ్యాంక్ నుంచి వ‌చ్చిన మెసేజ్ చూసి ఆందోళ‌న చెందారు. 
 
అయితే బ్యాంక్‌లో పాన్‌, ఆధార్ కార్డ్‌తో స‌హా కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తే తిరిగి హోల్డ్‌లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్‌, ఆధార్‌ను ఎందుకు లింక్ చేయాలో కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది.
 
ఇక పాన్ కార్డుతో ఆధార్‌ను ఆన్‌లైన్‌లో లింకు చేసేందుకు www.incometaxindiaefilling.gov.in లింకును కూడా ఎస్‌బీఐ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌తో షేర్ చేసింది. పాన్‌, ఆధార్ అనుసంధానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments