Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుమరుగవుతున్న గులాబీ రంగు కాగితం

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (14:27 IST)
దేశవ్యాప్తంగా 2వేల రూపాయల నోటు చలామణీ బాగా తగ్గిపోయింది. ఈ మధ్య కాలం వరకు ఎక్కువగా కనిపించే 2 వేల నోటు ఉన్నట్లుండి కనుమరుగవుతోంది. బ్యాంకులు, ఏటీఎంలలో కూడా 100, 500 రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో పెద్ద నోట్లు కావాలని అడిగినా కూడా లేవనే సమాధానం వస్తోంది. 
 
అయితే ఎన్నికలు జరుగుతుండటంతో వాటిని ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయకుండా ఆపినట్లు కొందరు భావిస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు కూడా తమ బ్యాంకుల్లో వచ్చే డిపాజిట్లలో 2 వేల నోట్లు చాలా తక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఇంకా వ్యాపారులు కూడా తమ కస్టమర్లు ఇదివరకు ఎక్కువగా 2 వేల నోట్లనే ఇచ్చేవారని కానీ ఇప్పుడు అందరూ 500 నోట్లనే ఇస్తున్నారని అంటున్నారు.
 
కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బును కొందరు బడా నాయకులు పెద్ద నోట్లుగా మార్చుకుని దాచుకుంటున్నారని కొందరు బ్యాంకర్ల వాదన. గతేడాది చలామణీలో ఉన్న నోట్లలో 2 వేల నోట్లు 37 శాతం ఉండగా ఈ ఏడాది దాని శాతం బాగా పడిపోయిందని తెలుస్తోంది. ఏదేమైనా సామాన్యులు మాత్రం 2 వేల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా ఉందని, అది చలామణీలో లేకపోవడమే మంచిదని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments