Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుమరుగవుతున్న గులాబీ రంగు కాగితం

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (14:27 IST)
దేశవ్యాప్తంగా 2వేల రూపాయల నోటు చలామణీ బాగా తగ్గిపోయింది. ఈ మధ్య కాలం వరకు ఎక్కువగా కనిపించే 2 వేల నోటు ఉన్నట్లుండి కనుమరుగవుతోంది. బ్యాంకులు, ఏటీఎంలలో కూడా 100, 500 రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో పెద్ద నోట్లు కావాలని అడిగినా కూడా లేవనే సమాధానం వస్తోంది. 
 
అయితే ఎన్నికలు జరుగుతుండటంతో వాటిని ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయకుండా ఆపినట్లు కొందరు భావిస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు కూడా తమ బ్యాంకుల్లో వచ్చే డిపాజిట్లలో 2 వేల నోట్లు చాలా తక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఇంకా వ్యాపారులు కూడా తమ కస్టమర్లు ఇదివరకు ఎక్కువగా 2 వేల నోట్లనే ఇచ్చేవారని కానీ ఇప్పుడు అందరూ 500 నోట్లనే ఇస్తున్నారని అంటున్నారు.
 
కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బును కొందరు బడా నాయకులు పెద్ద నోట్లుగా మార్చుకుని దాచుకుంటున్నారని కొందరు బ్యాంకర్ల వాదన. గతేడాది చలామణీలో ఉన్న నోట్లలో 2 వేల నోట్లు 37 శాతం ఉండగా ఈ ఏడాది దాని శాతం బాగా పడిపోయిందని తెలుస్తోంది. ఏదేమైనా సామాన్యులు మాత్రం 2 వేల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా ఉందని, అది చలామణీలో లేకపోవడమే మంచిదని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments