Webdunia - Bharat's app for daily news and videos

Install App

1500 మంది హైదరాబాదీయులకు 100 ఉచిత ది స్లీప్ కంపెనీ స్మార్ట్ గ్రిడ్ పరుపులు

ఐవీఆర్
శనివారం, 31 ఆగస్టు 2024 (20:20 IST)
భారతదేశంలోని ప్రముఖ కంఫర్ట్-టెక్ బ్రాండ్, ది స్లీప్ కంపెనీ 2024 ఆగస్టు 31న దాదాపు రూ. 25 లక్షల విలువైన 100 ఉచిత పరుపుల బహుమతికి హైదరాబాద్ నివాసితుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. స్మార్ట్‌గ్రిడ్ సాంకేతికతతో పేటెంట్ పొందిన పరుపులను ఉచితంగా పొందటానికి  మొత్తం 1500 మందికి పైగా వ్యక్తులు నాలుగు నిర్దేశిత టిఎస్‌సి స్టోర్‌లను సందర్శించారు. దాని ప్రపంచ స్థాయి ఉత్పత్తి పట్ల విశేషమైన ఆసక్తిని ప్రదర్శించారు. స్లీప్ కంపెనీ ఈ ఆఫర్ సమయంలో తమ స్టోర్‌లను సందర్శించిన వారికి ఉచిత దిండ్లను అందించడం ద్వారా హైదరాబాదీలను మరింత ఆనందపరిచింది, ఎక్కువ మంది ప్రజలు తమ ఉత్పత్తుల సౌకర్యాన్ని అనుభవించేలా ఈ ఆఫర్‌ను అందించింది.
 
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కోకాపేట్, కొండాపూర్, కార్ఖానాలోని నాలుగు టిఎస్‌సి స్టోర్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంచారు. కంపెనీ భారతదేశంలో 100 కోకో (కంపెనీ-యాజమాన్యం, కంపెనీ-నిర్వహణ) స్టోర్‌ల సంఖ్యను చేరుకున్న ముఖ్యమైన మైలురాయిని ఈ ఆఫర్ ద్వారా వేడుక జరుపుకుంది, సుమారు రూ. 1 కోటి విలువైన ఉచిత పరుపులను హైదరాబాద్‌లోనే కాకుండా ముంబై, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సిఆర్ సహా ఇతర మెట్రో నగరాల్లో కూడా అందించింది. నాలుగు నగరాల్లో మొత్తం 6,000 మంది వ్యక్తులు ఆఫర్‌ను క్లెయిమ్ చేయడానికి టిఎస్‌సి స్టోర్‌లను సందర్శించారు. వీరికి కంపెనీ 400 పరుపులు, 1,000 దిండ్లు ఇచ్చింది. ఈ నాలుగు నగరాల్లోని నివాసితుల నుండి ఆఫర్ గురించి ఆరా తీస్తూ స్లీప్ కంపెనీకి 10,000 కంటే ఎక్కువ ఫోన్ కాల్‌లు వచ్చాయి, ఇది ఆఫర్ పట్ల నగరవాసుల ఆసక్తి వెల్లడిచేస్తుంది.
 
ఈ ఆఫర్ ద్వారా, కస్టమర్లు ఎటువంటి ఖర్చు లేకుండా పేటెంట్ పొందిన సాంకేతికత యొక్క సౌకర్యాన్ని అనుభవించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందించడం కంపెనీ లక్ష్యం. స్లీప్ కంపెనీ కోఫౌండర్, ప్రియాంక సలోట్ మాట్లాడుతూ, “ప్రజలు బాగా నిద్రపోవడానికి తోడ్పడాలనే మా మిషన్‌లో భాగంగా  భారతదేశం అంతటా 400 ఉచిత పరుపులను అందించడం ద్వారా 100వ స్టోర్ మైలురాయిని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో ఈ పరుపుల బహుమతి అందించటం జరిగింది. మొదటి దశలో, మేము బెంగళూరులో ఇదే విధమైన బహుమతిని అందించాము, ఇది రూ. 1.25 కోట్ల విలువైన భారతదేశపు అతిపెద్ద మ్యాట్రెస్ బహుమతిగా నిలిచింది. మా వృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మా కస్టమర్‌లకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ఇది మేము వారితో పంచుకునే బలమైన బంధానికి నిజమైన ప్రతిబింబం. మెట్రో నగరాల్లోని ప్రజలు తమ బిజీ, తీవ్రమైన జీవనశైలి కారణంగా తరచుగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా, మేము మా పేటెంట్ పొందిన స్మార్ట్‌గ్రిడ్ మ్యాట్రెస్‌ని ఇంటికి తీసుకెళ్లే అవకాశాన్ని ప్రజలకు అందించాలనుకుంటున్నాము" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments