Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు ఎగనామం.. దర్జాగా భారత్-పాక్ మ్యాచ్ చూసిన విజయ్ మాల్యా

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (12:01 IST)
బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అనూహ్యంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శనమిచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ మైదానంలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అతను వీక్షించాడు.
 
ఇప్పటికే ఆర్థిక అక్రమాస్తుల కేసులలో విచారణ, అరెస్టు తప్పించుకోవడానికి మాల్యా దేశం వదలి బ్రిటన్‌ పారిపోయాడు. పలు కేసులు ఎదుర్కొంటున్న అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. 
 
ఇటీవల అతన్ని లండన్‌ స్కాట్‌లాండ్ యార్డ్‌ పోలీసులు అరెస్టు చేసినా, వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌ను వీఐపీ స్టాండ్‌లో కూర్చుని వీక్షించిన ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. పరారీలో ఉన్నా కూడా దర్జాగా నిర్భయంగా మాల్యా మ్యాచ్‌ చూడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments