Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంద్యం నుంచి బయటపడిన భారత్

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2009 (12:05 IST)
భారతదేశంలో ఆర్థికమాంద్యం కాస్త తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతానికి చేరుకోవచ్చని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) తెలిపింది.

ప్రస్తుతం దేశంలో అన్ని పరిశ్రమలలో ఉత్పత్తులు వేగవంతంగా పుంజుకుంటున్నాయని, ఆర్థిక సంకేతాలు కూడా సానుకూల వాతావరణంలో ప్రయాణిస్తున్నాయని ఆ సంస్థ డైరెక్టర్ మనోజ్ వోహ్రా తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి రేటు సరాసరి 6.5 శాతానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఇదే వృద్ధి రేటు 5.8 శాతానికి చేరుకుంటుందని భావించామని, కాని దేశంలో ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పట్టి ఉత్పత్తుల నిర్మాణం ఊపందుకుందని ఆయన తెలిపారు.

గడచిన కొద్ది నెలలుగా పారిశ్రామిక ఉత్పత్తులు, ఇతర ఆర్థిక రంగాలలో సానుకూల సంకేతాలు కనపడుతున్నాయని ఆయన అన్నారు. దీనినిబట్టి ఆర్థిక మాంద్యం నుంచి భారతదేశం బయటపడినట్లేనని ఆయన పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments