Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతికి భూములిచ్చిన రైతులకు అరుణ్ జైట్లీ వరం

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములిచ్చిన రైతులకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ వరమిచ్చారు. ఈ రైతులందరికీ... మూలధన పన్ను లాభాల (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహ

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:54 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములిచ్చిన రైతులకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఓ వరమిచ్చారు. ఈ రైతులందరికీ... మూలధన పన్ను లాభాల (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపును ఇచ్చారు. 
 
బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2017-18 వార్షిక బడ్జెట్‌లో ఈ వరాన్ని జైట్లీ ప్రకటించారు. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు మినహాయింపును ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం గతంలో జైట్లీని కోరింది. ఈ కోరిక మేరకు ఆయన ఈ వరాన్ని ప్రకటించారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వ కోర్కెను ఆయన మన్నించినట్టయింది. 
 
అయితే, విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యాసంస్థల నిర్మాణం, పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు నిధులు, ఇతర పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన మాటమాత్రం ప్రస్తావించక పోవడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments