Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేశ్ ప్రభు 2020 లక్ష్యాలివే... స్వర్ణ చతుర్భుజి మార్గంలో సెమీ హైస్పీడ్ రైళ్ళు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:47 IST)
కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 సంవత్సరానికి గాను రైల్వే వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో 2020 లక్ష్యాలను ప్రకటించారు. స్వర్ణ చతుర్భుజి మార్గంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను నడపాలని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
అలాగే, ఆన్‌ డిమాండ్‌పై రైల్వే రిజర్వేషన్లు అందించడం, అత్యున్నత సాంకేతికతతో భద్రతను మెరుగుపర్చడం, రవాణా రైల్వే టైంటేబుల్‌ను ఖచ్చితంగా అమలయ్యే విధంగా చేయడం, దేశంలో ఏ ప్రాంతంలో కూడా కాపలాలేని రైల్వే గేట్లు ఉండకుండా చేయడం, రైళ్ళ రాకపోకల సమయపాలనను ఖచ్చితంగా అమలయ్యేలా చూడటంతో పాటు.. రవాణా రైళ్ల సగటు వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచడం, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లవి 80 కిలోమీటర్లకు పెంచడం, మానవ వ్యర్థాలను నేరుగా బయటకు పంపడాన్ని అరికట్టడం వంటివి ఉన్నాయి. 
 
అంతేకాకుండా, రైల్వేలను పునర్‌ వ్యవస్థీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తన ప్రసంగ పాఠంలో నొక్కివక్కాణించారు. గత సంవత్సరం మధ్యకాలిక ప్రణాళికతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాను.. ఈ సారి పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments