బడ్జెట్ 2016-17‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం.. తెల్లని దుస్తుల్లో ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (10:46 IST)
కేంద్ర వార్షిక బడ్జెట్ 2016-17కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి సోమవారం ఉదయం ఆమోదముద్ర వేసింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
 
అంతకుముందు.. ఆయన రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ నుంచి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. అలాగే, అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఆర్థిక బడ్జెట్‌ ప్రతులను అధికారులు పార్లమెంటుకు చేర్చారు. వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోక్‌సభ సభ్యులకు అందజేస్తారు. 
 
మరోవైపు ఈరోజు నాకూ పరీక్షే అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తెల్లని దుస్తులు ధరించి పార్లమెంటుకు చేరుకున్నారు. 125 కోట్ల మంది ప్రజలు పెట్టే పరీక్షలో విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నానని చెప్పిన ప్రధాని అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలింపజేస్తూ ప్రశాంత వదనంతో పార్లమెంట్‌ భవన్‌కు చేరుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

Rashmika: రియల్ పెండ్లి కంటే ముందే రణబాలి లోని రీల్ పెండ్లి సాంగ్ రష్మికకు అంకితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

Show comments