ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది.. భారత్ సూపర్ : అరుణ్ జైట్లీ

Webdunia
సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (11:13 IST)
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌ను సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌‍సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలోనే ప్రపంచ ఆర్థిక మందగమనాన్ని గుర్తు చేశారు. గత 2014లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా ఉండగా, 2015లో ఇది 3.1 శాతానికి దిగజారిందని ఆయన గుర్తు చేశారు.
 
అయితే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్ ఆర్థిక వృద్ధిరేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొందని అరుణ్ జైట్లీ సభకు తెలిపారు. గత 21 నెలలుగా తాము తీసుకున్న అనేక చర్యల వల్ల వృద్ధిరేటు పెరిగిందన్నారు. దేశ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగిందన్నారు.
 
ఈ క్రమంలో తమకు ఎదురవుతున్న అనేక సవాళ్ళను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటును గణనీయంగా తగ్గించినట్టు తెలిపారు. అలాగే, గత రెండేళ్ళుగా వర్షాభావ పరిస్థితులు ఏమాత్రం బాగాలేదని, ప్రస్తుతం వర్షాభావం 13 శాతంగా నమోదైందని ఆయన చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

Show comments