ఒక కప్పు పెరుగులో, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె తీసుకోవాలి. ముందుగా పెరుగులో నిమ్మరసం, తేనె వేసి పేస్ట్లాగా అయ్యేంత వరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి.
అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ను అప్లై చేయాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుంది. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్తపడాలి.