Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోయాబీన్‌ను పచ్చిపాలలో కలిపి మూఖానికి పట్టిస్తే?

పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా తయారుచేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలుగా వేసుకోవ

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (11:41 IST)
పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా తయారుచేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలుగా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్న కడుక్కుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 
సోయాబీన్‌ను మెత్తగా రుబ్బుకుని అందులో పచ్చిపాలను కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలాచేయడం వలన ముఖం మృదువుగా తయారవుతుంది. నిమ్మరసంలో తులసి ఆకుల రసాన్ని కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడుక్కుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
శెనగపిండిలో నెయ్యి, పసుపు కలుపుకుని పేస్టులా తయారుచేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత మసాజ్ చేసుకుంటే పొడిబారిన చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. ప్రతిరోజూ చర్మానికి తేనె పూతగా రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు, తేనె, మీగడతో పాటు గులాబీ రసం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి.
 
ఆ పేస్టును ముఖానికి పూతలుగా వేసుకుని పావుగంట తరువాత కడిగేస్తే మచ్చలు, కాలిన గాయాలు, మెుటిమలు తొలగిపోతాయి. కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఇలాచేయడం వలన చర్మం తాజాగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments