Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..?

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె సమపాళ్లు బౌల్‌లోకి తీసుకుని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడ

Webdunia
శనివారం, 14 జులై 2018 (10:48 IST)
వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె సమపాళ్లు బౌల్‌లోకి తీసుకుని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడంవల్ల పెరుగుకీ ఉసిరికీ ఉన్న బ్లీచ్‌ గుణాల కారణంగా ముఖంమీద ఉన్న మొటిమల మచ్చలూ ట్యాన్‌ అన్నీ పోతాయి. 
 
అలాగే టేబుల్‌స్పూను బియ్యప్పిండిలో టీస్పూను గంధంపొడి, అరటేబుల్‌స్పూను పాలపొడి, టేబుల్‌స్పూను సెనగపిండి, టేబుల్‌స్పూను రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసి మొహానికీ చేతులకీ పట్టించి పావుగంట తర్వాత కడిగేస్తే.. చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోయి, ముఖమూ చేతులూ మెరుస్తుంటాయి. 
 
ఇంకా తులసీ, వేపాకుల పేస్టుకు టీస్పూను పసుపూ అరటీస్పూను నిమ్మరసం కలిపి పట్టించి ఆరాక కడిగేస్తే ముఖంపై మచ్చలు మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments