Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం దురదలకు పాలను రుద్దుకుంటే?

చర్మం పొడిబారకుండా ఉండాలంటే అరటిపండును గుజ్జులా చేసి అందులో స్పూన్ తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం తేమగా మారుతుంది. బొప్పాయి గుజ్జు

Webdunia
సోమవారం, 9 జులై 2018 (12:40 IST)
చర్మం పొడిబారకుండా ఉండాలంటే అరటిపండును గుజ్జులా చేసి అందులో స్పూన్ తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం తేమగా మారుతుంది. బొప్పాయి గుజ్జులో ఒక గుడ్డు సొన, అరచెంచా నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
 
దీన్ని ముఖానికి పట్టింటి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే మురికి జిడ్డూ వదిలిపోతాయి. గుడ్డుసొనలో కొద్దిగా మయోనైజ్, చెంచా నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. వదులుగా మారిన చర్మం బిగుతుగా మారాలంటే గుడ్డులోని తెల్లసొనను గిలకొట్టి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే చర్మం అందంగా మారుతుంది. 
 
ముఖచర్మం విపరీతంగా దురదగా ఉండే పాలలో దూదిని ముంచి ముఖానికి రాసుకుంటే దురదలు తగ్గిపోతాయి. మోకాళ్లూ బరకగా ఉన్నవారు స్పూన్ ఓట్‌మీల్‌‌ని మెత్తగా పొడిచేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మోకాళ్లకు రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మోకాళ్లు మృదువుగా తయారవుతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments