Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే?

మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూగా రాసుకుంటే కొద్ది రోజులకు మచ్చలు తొలగిపోతాయి. కీర దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి కనురెప్పలపై 10 నిమిషాల పాటు

Webdunia
శనివారం, 7 జులై 2018 (16:18 IST)
మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూగా రాసుకుంటే కొద్ది రోజులకు మచ్చలు తొలగిపోతాయి. కీర దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి కనురెప్పలపై 10 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. రోజూ ఇలా చేస్తే కళ్లకు అలసట తీరడమే కాకుడా కనుల కింద నల్లటి వలయాలు క్రమంగా అంతరించిపోతాయి.
 
రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో కనురెప్పలపైన, క్రింద తుడుచుకోవాలి. ఇలా రెండు, మూడు వారాలు చేస్తే కళ్ల కింద నల్లటి చారలు తొలగిపోతాయి. కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవడమే కాకుండా అరుచి లక్షణాలు పోతాయి.
 
బంగాళాదుంప గుజ్జులో రెండు చెంచాలా ఓట్స్, రెండు చెంచాల పాలు, రెండు చుక్కల తేనె, అర చెంచా ఆలివ్‌ నూనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మర్దన చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
 
ముడతలు పడిన చర్మం కాంతివిహీనంగా కనిపించేలా చేస్తుంది. బొప్పాయిని మెత్తని గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా వరిపిండి, పాలు, కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటే చర్మంపై ఉన్న ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments