Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసం, తేనె ముఖానికి రాసుకుంటే? ముఖం మృదువుగా మారుతుందా?

చర్మ సంరక్షణ విషయంలో కాస్త శ్రద్ధ పెడితేనే అందం రెట్టింపవుతుంది. చిన్నచిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. చర్మంపై మృతకణాలు పేరుకున్నప్పుడు ముఖం నిర్జీవంగా మారుతుంది. చర్మం మీ వయస్సు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పావుకప్పు బొప్పాయి గుజ్జులో కాస్

Webdunia
బుధవారం, 4 జులై 2018 (12:23 IST)
చర్మ సంరక్షణ విషయంలో కాస్త శ్రద్ధ పెడితేనే అందం రెట్టింపవుతుంది. చిన్నచిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. చర్మంపై మృతకణాలు పేరుకున్నప్పుడు ముఖం నిర్జీవంగా మారుతుంది. చర్మం మీ వయస్సు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పావుకప్పు బొప్పాయి గుజ్జులో కాస్త పెరుగు, పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
 
10 నిమిషాల తరువాత కడుక్కుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఇలా చేయడం వలన రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. కళ్లకింద నల్లడి చారలు ఏర్పడి చర్మం సాగినట్లు అనిపిస్తే కోడి గుడ్డులోని తెల్ల సొనను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
 
ఇలా చేస్తే చర్మం బిగుతుంగా మారడంతోపాటు కళ్లు కాంతివంతగా కనిపిస్తాయి. చర్మానికి తగిన మెుత్తంలో విటమిన్ ఇ అందితే మేని నిగనిగలాడుతుంది. దీనికి రెండు చెంచాల తేనెలో కాస్త నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మానికి తేమ అంది నిగనిగలాడుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments