Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి అలసట తొలగిపోవాలంటే?

కంటి అలసట తొలగిపోవాలంటే... కీరను చక్రాల్లా కోసి కళ్లపై ఉంచుకుని పదినిమిషాల తరువాత తీసేయాలి. కళ్ల అలసట పోతుంది. కంటి మంట తగ్గిపోతుంది. అదేపనిగా కంప్యూటరుతో పనిచేసేవాళ్లు కళ్లకు సంబంధించిన వ్యాయామాల్ని

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (11:00 IST)
కంటి అలసట తొలగిపోవాలంటే... కీరను చక్రాల్లా కోసి కళ్లపై ఉంచుకుని పదినిమిషాల తరువాత తీసేయాలి. కళ్ల అలసట పోతుంది. కంటి మంట తగ్గిపోతుంది. అదేపనిగా కంప్యూటరుతో పనిచేసేవాళ్లు కళ్లకు సంబంధించిన వ్యాయామాల్ని కచ్చితంగా చేయాలి. ముందు కళ్లను గుండ్రంగా తిప్పాలి. తరవాత కుడి, ఎడమలవైపు తిప్పాలి. ఇలా రోజులో కుదిరినప్పుడల్లా చేస్తే అలసట దూరమవుతుంది. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.
 
అలాగే కీరదోస రసంలో కాస్త గులాబీనీరు కలిపి అందులో దూది ఉండల్ని ముంచి కళ్లపై పెట్టుకోవాలి. అవి ఆరిపోయాక తీసేస్తే అలసట పోవడమే కాదు.. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కళ్ల అలసటను దూరం చేసి, సాంత్వన అందించడంలో తేనె, పాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. 
 
రెండు చెంచాల తేనెలో కాసిని పాలు కలిపి కళ్ల చుట్టూ నెమ్మదిగా దూదితో రాసుకోవాలి. ఇది బాగా ఆరాక చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే ఫలితం ఉంటుంది. కళ్ల మంట కూడా తగ్గుతుంది. ఒక బంగాళాదుంపను తురిమి దాన్ని కళ్లపై పెట్టుకోవాలి. బాగా ఆరాక కడిగేస్తే చాలు. అలసట పోవడమే కాదు, నల్లనివలయాలూ తొలగిపోతాయని బ్యూటీషియన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments