Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోసపండును ఇలా ఉపయోగిస్తే..?

దోసపండు సౌందర్య పోషణకు ఎంతగానో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ప్రోటీన్లు, కొవ్వు కేశాలకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దోసపండ్ల రసం, కీరాల రసం చెరో టీ స్పూన్ చొప్పున కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం

Webdunia
సోమవారం, 23 జులై 2018 (14:04 IST)
దోసపండు సౌందర్య పోషణకు ఎంతగానో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ప్రోటీన్లు, కొవ్వు కేశాలకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దోసపండ్ల రసం, కీరాల రసం చెరో టీ స్పూన్ చొప్పున కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే పావు కిలో చొప్పున పెసరపప్పు, శీకాయలకు వందగ్రాములు, దోసగింజలు కలిపి, పిండి చేసుకోవాలి. వారానికోసారి ఈ పిండిని తలకు పట్టించుకుని తలస్నానం చేస్తే, జుట్టు మృదువుగా, మెరుపును సంతరించుకుంటుంది. 
 
ఇక దోసగింజలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. వందగ్రాముల దోసగింజల పొడికి అంతే ఓట్స్‌ పొడి తీసుకుని, కీరాల రసంతో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను శరీరానికి రాసుకుని స్నానం చేయాలి. ఇలాచేస్తే తైలమర్దనం చేసుకుని అభ్యంగనస్నానం చేసినంత తాజాగా ఉంటుంది. సువాసనభరితంగానూ ఉంటుంది. ఓట్స్ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. దోసగింజలు జుట్టుకు చక్కని కండిషనర్‌గా పని చేస్తుంది.  
 
పాల పొడి, దోసగింజల పొడి సమానంగా తీసుకుని, నీటిలో కలిపి, కళ్ల చుట్టూ పూతలా వేసుకుని.. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే  కళ్ల చుట్టూ ఉండే ముడతలు, నల్లని వలయాలు, అలసట పోయి, కళ్లు ప్రకాశవంతం అవుతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments