Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ హెడ్స్‌ను తొలగించే.. దాల్చిన చెక్క...

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (16:26 IST)
ముఖంపై ఏర్పడే బ్లాక్ హెడ్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగినులకైతే ఈ తరహా సమస్యలు వేధిస్తాయనడంలో సందేహం లేదు. మొటిమలు వచ్చిన ఆ ప్రదేశంలో మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని తొలగించుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి వారు ఈ తరహా పెరటి వైద్యంతో ఉపశమనం పొందొచ్చు. అవేంటో తెలుసుకుందాం..
 
సాధారణంగా చర్మంపై ఏర్పడే గాయాలకు మందుగా పసుపును వాడుతుంటారు. ఈ పసుపు నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది. ఎలాలో చూద్దాం.. పసుపులో కొద్దిగా పుదీనా రసం కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఆ ప్యాక్ బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖానికి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మూడు రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
నల్లటి మచ్చలు తొలగించాలంటే ఇలా చేయాలి.. దాల్చిన చెక్కను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ రాత్రి పడుకునే ముందుగా వేసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా వారం పాటు చేస్తే.. నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతో అలసట, ఒత్తిడి కూడా తొలగిపోతుంది. 
 
అలానే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా పసుపు, పెరుగు, తులసీ రసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలిగిపోయి ముఖం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments