స్నానానికి ముందు కొబ్బరి నీళ్ళలో కాస్త పెసరపిండి కలిపి..?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (11:26 IST)
కొన్ని సార్లు మొటిమలు పోయి మచ్చలు మాత్రం మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు కొబ్బరి పాలతో ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్తున్నారు బ్యూటీషన్లు. మరి ప్యాక్ ఎలా వేసుకోవాలంటే.. కొబ్బరిపాలలో స్పూన్ గులాబీ నీరు, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తప్పక మచ్చలు పోతాయి.
 
కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో నిమ్మరసం, పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే నిర్జీవంగా మారిన చర్మం కొత్త కాంతిని పొందుతుంది.
 
రోజూ స్నానానికి ముందు కొబ్బరి నీళ్ళలో కాస్త పెసరపిండి, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా పట్టించాలి. ఆపై 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఇలా రోజూ స్నానానికి ముందు చేస్తే చర్మం శుభ్రపడుతుంది. మచ్చలు తగ్గుతాయి.
 
తరుచు మృతుకణాల సమస్య వేధిస్తుంటే.. కొబ్బరి తురుములో స్పూన్ పాలమీగడ, తేనె, నిమ్మరసం, శెనగపిండి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. చర్మం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత నరహరి

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments