Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలిపి..?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:27 IST)
ఈ కాలంలో చాలామందికి ముఖంపై మొటిమలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఈ మొటిమ సమస్యను తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. ఒక్కసారి లేదా రెండుసార్లు అవి బాగా పనిచేస్తాయి. మరి తరువాత సంగతేంటి.. ఎల్లప్పుడూ ఆ క్రీమ్స్ వాడలేం కదా. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన ఈ చిన్న పాటి చిట్కాలు పాటించి చూడండి... తప్పక ఫలితం ఉంటుంది.
 
రెండు బాదం పప్పులను తీసుకుని వాటిని సన్నని మంటపై కాల్చుకోవాలి. ఆపై ఓ చిన్న గిన్నె తీసుకుని అందులో కాల్చిన బాదం పప్పులు వేసి మెత్తని పొడిలా చేసుకుని అందులో స్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మొటిమలున్న ప్రాంతాల్లో రాసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రం కడుక్కోవాలి. ఇలా వారం పాటు క్రమంగా చేస్తే ముఖంపై గల మొటిమలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
అలానే కొందరికి చర్మమంతా జిడ్డు జిడ్డుగా పొడిబారినట్టు ఉంటుంది. అలాంటి చర్మాన్ని మృదువుగా చేయాలంటే.. కప్పు కాఫీ పొడిలో 2 స్పూన్ల కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు రాసుకుని గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments