Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబంద ఆకుల మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

చాలామందికి ఎక్కువగా బయట తిరగడం వలన ముఖంపై జిడ్డు, మురికి ఏర్పుడుతుంటాయి. మరికొంతమందికి ఎప్పుడూ ముఖం జిడ్డుగానే ఉంటుంది. దీంతో మెుటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలో జిడ్డును, మురికిని పోగ

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (12:30 IST)
చాలామందికి ఎక్కువగా బయట తిరగడం వలన ముఖంపై జిడ్డు, మురికి ఏర్పుడుతుంటాయి. మరికొంతమందికి ఎప్పుడూ ముఖం జిడ్డుగానే ఉంటుంది. దీంతో మెుటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలో జిడ్డును, మురికిని పోగొట్టేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు, మురికి పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. కలబంద ఆకులను నీటిలో వేసి మరిగించుకోవాలి. ఈ ఆకులను మిశ్రమంలా తయారుచేసుకుని అందులో కొద్దిగా తేనెను కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడం ముఖం మృదువుగా మారుతుంది. కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు, కీరదోస రసం, రోజ్‌వాటర్‌ను కలుపుకుని ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
కలబంద గుజ్జులో కొద్దిగా ఓట్స్, కీరదోస తురుమును వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 3 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు, మురికి తొలగిపోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments