Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబంద ఆకుల మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

చాలామందికి ఎక్కువగా బయట తిరగడం వలన ముఖంపై జిడ్డు, మురికి ఏర్పుడుతుంటాయి. మరికొంతమందికి ఎప్పుడూ ముఖం జిడ్డుగానే ఉంటుంది. దీంతో మెుటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలో జిడ్డును, మురికిని పోగ

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (12:30 IST)
చాలామందికి ఎక్కువగా బయట తిరగడం వలన ముఖంపై జిడ్డు, మురికి ఏర్పుడుతుంటాయి. మరికొంతమందికి ఎప్పుడూ ముఖం జిడ్డుగానే ఉంటుంది. దీంతో మెుటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలో జిడ్డును, మురికిని పోగొట్టేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు, మురికి పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. కలబంద ఆకులను నీటిలో వేసి మరిగించుకోవాలి. ఈ ఆకులను మిశ్రమంలా తయారుచేసుకుని అందులో కొద్దిగా తేనెను కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడం ముఖం మృదువుగా మారుతుంది. కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు, కీరదోస రసం, రోజ్‌వాటర్‌ను కలుపుకుని ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
కలబంద గుజ్జులో కొద్దిగా ఓట్స్, కీరదోస తురుమును వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 3 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు, మురికి తొలగిపోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments