Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటిపై తేనె రాసుకుంటే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 27 జులై 2019 (21:27 IST)
ప్రస్తుతకాలంలో చాలామంది మొటిమల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. వాటిని నివారించుకోవడానికి పలురకాల క్రీంలు వాడినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా సహజసిద్దమైన కొన్ని పదార్దాలను ఉపయోగించి ఈ సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. ముఖం మీద మొటిమలు కనిపించగానే తేనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనె యాంటీసెప్టిక్‌గా పని చేసి మొటిమల్ని త్వరగా తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు తెస్తుంది. అంతేకాకుండా చర్మంపై బ్యాక్టీరియా చేరి మొటిమలు రాకుండా నివారించడంలో కూడా తేనె త్వరితంగా పని చేస్తుంది. ఎలాంటి చర్మానికైనా తేనె సరిపడుతుంది.
 
2. ఈ సమస్యకు గుడ్డు తెల్లసొన బాగా పని చేస్తుంది. తెల్లసొనను ముఖంపై రాసుకోవడం వలన మొటిమలు రాకుండా నివారించడమే కాకుండా చర్మం మృదువుగా అవుతుంది. జిడ్డును నివారించడానికి కూడా గుడ్డు తెల్లసొనను మించింది ఏమీ లేదు.
 
3. కలబంద చర్మంపై జిడ్డును అదుపు చేసి మృత కణాలను తొలగించి కొత్త కణాలను ఏర్పరుస్తుంది. అందుకని కలబంద గుజ్జును ముఖానికి రాసుకోవడం వలన మొటిమలు తగ్గడమే కాకుండా వాటి తాలూకూ మచ్చలను కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా కలబంద గుజ్జులో పసుపు కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి కలబంద గుజ్జు రాసుకుని ఆరిన తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన మొటిమలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments