Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం కోసం దున్న.. ఆహారం కోసం మొసలి : మధ్యలో నీటిగుర్రం.. ఏది గెలిచింది?

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (14:54 IST)
అడవి మృగాలు అతి క్రూరంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమ ఆకలిని తీర్చుకునేందుకు క్రూరంగా దాడికి తెగబడతాయి. ఇలాంటి వన్యప్రాణుల పోరాటం దక్షిణాఫ్రికాలోని శాబిశాండ్స్ సఫారీ పార్కులో అరుదైన దృశ్యాలుగా కనిపిస్తుంటాయి. తాజాగా, నీటి కోసం దున్న.. ఆహారం కోసం మొసలి.. మధ్యలో నీటిగుర్రం మధ్య జరిగిన పోరాటం.. చూపరులను భీతికొల్పేలా ఉంది. వీటి పోరాటాన్ని నిక్ క్లీర్ అనే సఫారీ ఫోటోగ్రాఫర్ తన వీడియోలో బంధించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...ఓ అడవి దున్న.. నీళ్లు తాగడానికి నీటి మడుగు వద్దకు వచ్చింది.


ఆ మడుగులో ఉన్న ఓ మొసలి ఒకటి.. దానిపై దాడి చేసి మెడబట్టి నీళ్లల్లోకి లాగేసింది. ప్రాణాల కోసం దున్న పోరాటం.. ఆహారం కోసం మొసలి ఆరాటం. ఇంతలో ఓ నీటిగుర్రం (హిప్పోపొటమస్‌) వాటి మధ్య దూరి యుద్ధం చేసింది. చివరికి.. దున్న ఓపిక తగ్గి ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడింది. నీటిగుర్రం కూడా తన పట్టును సడలించింది. దీంతో మొసలి దున్నను తన ఆహారంగా స్వీకరించింది. ఏకంగా గంటపాటు సాగిన ఈ యుద్ధాన్ని ఆ ఫొటోగ్రాఫర్‌ చిత్రీకరించి బాహ్యప్రపంచానికి చూపించాడు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments