Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసేందుకు విశాఖకు రూ.1400 కోట్లు :ప్రెస్ రివ్యూ

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (14:18 IST)
హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం విశాఖకు రూ. 1400 కోట్లు ఇవ్వనుందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ విభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 15వ ఆర్థికసంఘం రూ.1,400 కోట్ల గ్రాంట్‌ను సిఫార్సు చేసింది.

 
నగరాన్ని ప్రధాన ఆర్థిక కేంద్రంగా, అభివృద్ధి సూచీ (గ్రోత్‌పోల్‌)గా రూపుదిద్దాలని.. ఇందుకోసం రహదారులు, నీటిసరఫరా, విద్యుత్తు పంపిణీ, భూగర్భ డ్రైనేజీ, అవసరమైన భవనాల నిర్మాణానికి ఏపీ నిధులు కోరింది. ఈ మేరకు తాము సిఫార్సు చేశామని ఆర్థిక సంఘం వెల్లడించింది. తక్కువ వర్షపాతం పడేచోట, దీర్ఘకాలంగా కిడ్నీవ్యాధులు, ఫ్లోరైడ్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు గ్రాంట్లు కావాలని కూడా ఏపీ విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నట్లు పత్రిక రాసింది.

 
అందుకే కిడ్నీ సమస్యలున్న ఉద్దానం ప్రాంతానికి రూ.300 కోట్లు, ఫ్ల్లోరైడ్‌ సమస్యతో సతమతమవుతున్న గుంటూరు జిల్లాలోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతాలకు కలిపి రూ.400 కోట్లు, యురేనియం ఫిల్టరింగ్‌తో ప్రభావితమైన పులివెందుల ప్రాంతానికి రూ.200 కోట్ల ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ఆర్థికసంఘం తెలిపింది.

 
రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.2,300 కోట్ల రాష్ట్ర ప్రత్యేక గ్రాంట్లన్నీ ఈ పనులకే ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఈ పద్దు కింద 2021-22లో ఏమీ రాదు. తర్వాత రెండేళ్లలో ఏటా రూ.460 కోట్ల చొప్పున విడుదలవుతుంది. మిగిలిన రెండేళ్లు రూ.690 కోట్ల చొప్పున అందుతుందని ఈనాడు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments