అక్రమ మైనింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన డీఎస్పీపైకి డంపర్, మృతి

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (18:41 IST)
హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిని డంపర్‌తో తొక్కి చంపించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. మీడియా కథనాల ప్రకారం... ‘మేవాత్ జిల్లాలోని తావడు డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్, నుహ్‌లోని అక్రమ మైనింగ్ కేసును విచారించడానికి వెళ్లారు.

 
ఇద్దరు పోలీసులతో ఆయన మంగళవారం 11.50 ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఒక డంపర్‌ను ఆపారు. పేపర్లు అడగ్గా డ్రైవర్ వేగం పెంచి డంపర్‌ను పోలీసుల కారు మీదకు ఎక్కించాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్, గన్‌మెన్ తప్పించుకోగా డీఎస్పీ సురేంద్ర మాత్రం చనిపోయారు.’ 1994లో అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా చేరిన సురేంద్ర ఆ తరువాత డీఎస్పీ స్థాయికి ఎదిగారు. మరొక నాలుగు నెలల్లో ఆయన రిటైర్ కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments