Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ మైనింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన డీఎస్పీపైకి డంపర్, మృతి

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (18:41 IST)
హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిని డంపర్‌తో తొక్కి చంపించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. మీడియా కథనాల ప్రకారం... ‘మేవాత్ జిల్లాలోని తావడు డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్, నుహ్‌లోని అక్రమ మైనింగ్ కేసును విచారించడానికి వెళ్లారు.

 
ఇద్దరు పోలీసులతో ఆయన మంగళవారం 11.50 ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఒక డంపర్‌ను ఆపారు. పేపర్లు అడగ్గా డ్రైవర్ వేగం పెంచి డంపర్‌ను పోలీసుల కారు మీదకు ఎక్కించాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్, గన్‌మెన్ తప్పించుకోగా డీఎస్పీ సురేంద్ర మాత్రం చనిపోయారు.’ 1994లో అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా చేరిన సురేంద్ర ఆ తరువాత డీఎస్పీ స్థాయికి ఎదిగారు. మరొక నాలుగు నెలల్లో ఆయన రిటైర్ కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments